హైదరాబాద్‌ లో MRPS నాయకుడు కిడ్నాప్‌ !

-

హైదరాబాద్‌ లో MRPS నాయకుడు కిడ్నాప్‌ అయ్యాడు. ఈ సంఘటన గురువారం తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగీలో ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ అదృశ్యం అయ్యాడు. నిన్న మద్యాహ్నం ఇంటి నుండి బయటకు వెళ్లారు MRPS నాయకుడు నరేందర్ అతని స్నేహితుడు. ఇక బుధవారం రోజు అర్ధరాత్రి దాటినా ఇంటికి తిరిగి రాకపోవడంతో నార్సింగీ పోలీసులను ఆశ్రయించారు MRPS నాయకుడు నరేందర్ కుటుంబ సభ్యులు.

MRPS leader kidnapped in Hyderabad

బృందా వన్ కాలనీకి నరేందర్ అతని స్నేహితుడు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. MRPS నాయకుడు నరేందర్ ను కిడ్నాప్ చేసారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణలు చేస్తున్నారు. దీంతో నార్సింగీ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు MRPS నాయకులు. ఇక ఇప్పటికే నలుగురు ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు నార్సింగీ పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version