అమాయకురాలైన నా బిడ్డను వాడుకుంటున్నారు – ముత్తిరెడ్డి ఎమోషనల్‌

-

అమాయకురాలైన నా బిడ్డను వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. తన కూతురు పై హైకోర్టును ఆశ్రయించిన విషయంలో భావోద్వేగానికి గురయ్యారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి. జనగామ జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాజ్ఞాస్టిక్ సెంటర్ లో అప్గ్రేడ్ చేయబడిన 134 వైద్య పరీక్షలను వర్చువల్ గా ప్రారంభమైన కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.

అమాయకురాలైన నా బంగారు తల్లి నా బిడ్డను వాడుకొని అల్లుడిని ప్రేరేపించడం అధర్మం..కష్టం చేసుకుని జీవిస్తున్న అమాయకురాలైన నా బిడ్డను మూర్ఖులు దౌర్భాగ్యులు రోడ్డు పాలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. సమాజానికి మంచిది కాదు, వారికి అరిష్టం కలుగుతుందని… నీతిగా ప్రజా క్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప, నా బిడ్డను వాడుకొని,అల్లుడిని ప్రేరేపించడం మంచిది కాదని విమర్శలు చేశారు. రాజ్యాంగబద్ధంగా నా బిడ్డను ఏమనే పరిస్థితి లేక తప్పని పరిస్థితుల్లో హైకోర్టు ను ఆశ్రయించానని..ఆ స్థలంలో నా బిడ్డ నిర్మాణం చేసుకుంటానని పేర్కొందని, కానీ అలాంటి నా బిడ్డను మీస్ గైడ్ చేసి రోడు పై వేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. అలాంటి వారిని భగవంతుడు క్షమించడు… ప్రజలు గమనిస్తున్నారు..ప్రజాసేవ చేయాలి కాబట్టి నేను ప్రజాసేవలోనే ఉంటానన్నారు. నా బిడ్డ ప్రజలకు స్థలాన్ని దానం ఇవ్వడం స్వాగతిస్తున్నానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news