తాగిన వాడు ఊగాలి.. పవన్ కళ్యాణ్ ఎందుకు ఊగుతున్నాడు – నందిగామ సురేష్

-

తాగిన వాడు ఊగాలి.. పవన్ కళ్యాణ్ ఎందుకు ఊగుతున్నాడని నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ నందిగామ సురేష్. పవన్ క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారని… పవన్ ప్యాకేజ్ ఏ క్లాస్ నుంచి అందుకున్నారని తెలిపారు. పవన్ పోటీ చేసిన స్థానాల్లో ఖర్చు పెట్టిన డబ్బు ఏ క్లాస్ నుంచి వచ్చింది, ఎవరు ఖర్చు పెట్టారు ప్రజలకు తెలుసు అని… పవన్ కళ్యాణ్‌.. టీ తాగిన గ్లాస్ పవన్ తెచ్చుకుంటే టీ చంద్ర బాబు పోశాడన్నారు నందిగామ సురేష్.

చంద్రబాబు కి బానిసత్వం చేయటంలో పవన్ కి అలసట రావటం లేదని.. జగన్ సంక్షేమం చేస్తుంటే రాష్ట్ర శ్రీలంక అవుతుందని పవన్ చెప్పారని వెల్లడించారు. మరి అదే పవన్ అధికారంలో వస్టే జగన్ కంటే ఎక్కువ చేస్తామనటానికి సిగ్గు ఉండాలని ఫైర్‌ అయ్యారు. పవన్ కళ్యాణ్‌ తాను మాత్రమే సత్య హరిచంద్రుడు అని అనుకుంటున్నారన్నారు. మందు తాగిన వాళ్ళు మాత్రమే ఊగాలి..వాగాలి… పవన్ ఎందుకు అలా ఊగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నందిగామ సురేష్.

Read more RELATED
Recommended to you

Latest news