రేవంత్ రెడ్డిని తొక్కుతానాన్న మైనంపల్లి హన్మంతరావు.. ఆడియో వైరల్

-

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. భారత రాష్ట్ర సమితి నేతలు అలాగే రేవంత్ రెడ్డి పై మైనంపల్లి హన్మంతరావు అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో వైరల్ గా మారింది. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తొక్కుతానని మైనంపల్లి హనుమంతరావు ఆ వీడియోలు పేర్కొన్నాడు.

అలాగే తాను ఎవరికి భయపడనని… సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ ఎవరైనా అసలు భయపడబోవునని స్పష్టం చేశారు. కావాలని నేను ఎవరి దగ్గరకు వెళ్ళను… నా దగ్గర కు ఎవరూ రారు… ఇటీవల ప్రకటించిన సీట్లలో 90 శాతం రెడ్లకే ఇచ్చారని ఫైర్ అయ్యాడు హనుమంతరావు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి మరియు మహేందర్ రెడ్డి లకు వార్నింగ్ ఇచ్చానని… ఉద్యమం టైంలో ఆంధ్రకు మద్దతు ఇచ్చినట్లు ఆ ఆడియోలు స్పష్టంగా ఉంది. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో మైనంపల్లి హనుమంతరావుకు ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news