బీజేపీ నేత కిడ్నాప్.. మైనంపల్లికి లింకులు ?

-

 

జనగామ జిల్లా బీజేపీ నేత కిడ్నాప్ కలకలం రేపుతోంది. బీజేపీ నాయకుడు ముక్కెర తిరుపతి రెడ్డి మిస్‌ అయ్యారు. హైదరాబాద్ లోని అల్వాల్ ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఇదే సంఘటన తెలంగాణ రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌ గా మారింది.

అయితే.. బీజేపీ నాయకుడు ముక్కెర తిరుపతి రెడ్డి కిడ్నాప్ విషయం లో ఘాటుగా స్పందించారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. తిరుపతి రెడ్డి కిడ్నాప్ కి నాకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. వాడెవడో నాకు తెలియదు.. ఎప్పుడూ కలవలేదన్నారు. బీజేపీ నాయకుడు ముక్కెర తిరుపతి రెడ్డి థర్డ్ క్లాస్ ఫెల్లో అంటూ నిప్పులు చెరిగారు. తిరుపతి రెడ్డి పై ఎన్ని కిడ్నాప్ కేసులు ఉన్నాయి… నాపై ఉద్దేశ పూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. త్వరలోనే అన్నీ ప్రూవ్ చేస్తానని.. వాడి బండారం బయటపెడతానని హెచ్చరించారు బీజేపీ నాయకుడు ముక్కెర తిరుపతి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version