10 మంది BRS ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌ లోకి వస్తారు – మైనంపల్లి !

-

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలే పదిమంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు సంచలన వాక్యాలు చేశారు. ఓటు వేయడానికి వచ్చి గురువారం రోజు ఒక ప్రమాదంలో మరణించిన మహిళ లావణ్య కుటుంబాన్ని పరామర్శించడానికి మెదక్ జిల్లాలోని రామాయంపేటలో దామర చెరువు గ్రామానికి వచ్చిన హనుమంతరావు విలేకరులతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.

mynampally comments on brs mlas

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు డిసెంబర్ 4వ తారీఖు తర్వాత మంత్రివర్గ సమావేశం నిర్వహించడం పైన తన అభిప్రాయం అడగ్గా…. గురువారం రోజు కూడా సీఎం కెసిఆర్ తన మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశాడని అన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలను కొనుక్కుందామని ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మైనంపల్లి.

Read more RELATED
Recommended to you

Latest news