ఈ నెల 16న నాగర్ కర్నూలు జిల్లాకు సీఎం కేసీఆర్‌ !

-

 

 

ఈ నెల 16న నాగర్ కర్నూలు జిల్లాకు సీఎం కేసీఆర్‌ వస్తున్నారని… మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి, భారీ బహిరంగ సభ కోసం స్థల పరిశీలన చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బిరం హర్షవర్ధన్ రెడ్డి,గువ్వల బాల్ రాజ్…అధికారులు.

cm kcr
cm kcr

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కెపాసిటీ ఉన్న మోటర్ లను ఈ ప్రాజెక్టుకు పెట్టడం జరిగిందని..ప్రాజెక్టు కింద ఉన్నది మోటార్లు పెట్టి ఎలా పైకి నీరు ఎక్కిస్తారని కొందరు దుర్మార్గులు అన్నారు. మరి ఇప్పుడు ఎలా ఎక్కాయన్నారు. పాలమూరు రంగారెడ్డి పథకం ఎత్తిపోతల ద్వారా 20 టీఎంసీల నీటిని ఇవ్వాలని కేసీఆర్ అపరభగీరథుడిలా పనిచేశాడు…ఈ నెల 16న కేసీఆర్ నీటి విడుదల కు వస్తున్నందున చాలా సంతోషంగా ఉందని వివరించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news