నార్సింగి వద్ద ఢీకొన్న రెండు లారీలు.. మంటలు చెలరేగి ఇద్దరు సజీవదహనం

-

మెదక్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి మండలం కాస్లాపూర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను, అటుగా వస్తున్న మరో కంటైనర్​ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కంటైనర్‌లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగి క్యాబీన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అటుగా వెళ్తున్న వాహనాదారులు, స్థానికులు ఈ ప్రమాదాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే కంటైనర్ క్యాబిన్​లో ఉన్న ఇద్దరు సజీవ దహనమైనట్లు గుర్తించారు. మృతులు కర్ణాటక రాష్ట్రనికి చెందిన నాగరాజు, బసవరాజులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news