టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిగా నవీన్‌ నికోలస్‌

-

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఛైర్మన్ గా ఇటీవలే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆ కమిషన్ కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం నవీన్ నికోలస్ ను నియమించింది. త్వరలోనే ఈయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

రాష్ట్రంలో ఇటీవల ఐఏఎస్, ఐపీస్ అధికారుల బదిలీలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా తొమ్మిది మంది ఐఏఎస్‌ అధికారులను, ఒక ఐఎఫ్‌ఎస్‌ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను బదిలీ చేసిన సర్కార్.. ఆ స్థానంలో ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ను నియమించింది.

నికోలస్‌ గతంలో గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకుడిగా పని చేసినప్పుడు గురుకుల నియామక బోర్డు కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పర్యవేక్షించిన అనుభవం ఉండటంతో ఆయణ్ను టీఎస్పీఎస్సీకి బదిలీ చేశారు.  ఇటీవలే ఐఏఎస్‌గా పదోన్నతులు పొంది వెయిటింగ్‌లో ఉన్న సీతాలక్ష్మి, ఫణీంద్రరెడ్డిలకు పోస్టింగులు ఇచ్చింది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి వీఎస్‌ఎన్వీ ప్రసాద్‌ పౌరసరఫరాల సంచాలకునిగా నియమితులయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news