తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద

-

Nerella Sharada as Chairperson of Telangana Women’s Commission:  తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ నాయకురాలు నేరెళ్ల శారదను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద మాట్లాడుతూ… నాపైన నమ్మకం ఉంచి మహిళా కమిషన్ చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.

Nerella Sharada as Chairperson of Telangana Women’s Commission

మహిళలపైన జరుగుతున్న అకృత్యాలపై అవగాహన కల్పిస్తానని వివరించారు. మహిళల సంరక్షణతో పాటు పురుషులు స్త్రీలను గౌరవించే విధంగా పని చేస్తామన్నారు. మహిళా కమిషన్ సమీక్ష సమావేశం తరువాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద.  మహిళల కోసం 5వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని.. మహిళా సంఘాల వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిం దని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version