బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవు – బండి సంజయ్

-

తెలంగాణ బిజెపిలో నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మళ్లీ బిఆర్ఎస్ లోకి వెళతారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా అయోమయంలో ఉన్నారని అన్నారు. ఇక గ్రానైట్ తో తనకు సంబంధం ఉందన్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనని.. ఇప్పటికే అమ్మవారి పై ప్రతిజ్ఞ చేశానని, మళ్లీ చేయమన్నా చేస్తానన్నారు.

ఇక తెలంగాణలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు బండి సంజయ్. తెలంగాణలో లిక్కర్ దందా వెనక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. చీప్ లిక్కర్ కు ఖరీదైన లేబుల్స్ వేసి అమ్ముతున్నారని ఆరోపించారు. దీనిపై దమ్ముంటే విచారణకు ఆదేశించాలని సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణలో జరుగుతున్న లిక్కర్ స్కాం వెనుక ఎవరి హస్తముందో విచారణ జరపాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news