తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నమోదు అయినట్లు వాతావరణ శాఖా పేర్కొంది. దింతో ఇవాళ, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది.

అటు జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, పంజాగుట్ట, బేగంపేట్, మాదాపూర్, సికింద్రాబాద్, సైదాబాద్ అలాగే చంచల్గూడా, బంజర హిల్స్ లాంటి ప్రాంతాలలో.. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఇక ఇవాళ కూడా హైదరాబాద్ మహానగరంలో మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. మరో రెండు నుంచి మూడు గంటల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు బయటకు రాకూడదని… పేర్కొంది.