మా అమ్మాయిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు – పల్లవి పేరెంట్స్

-

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ తండాకు చెందిన అంగోతు సరిత, అంతిరామ్ దంపతుల కుమార్తె పల్లవి (21) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది పల్లవి. అయితే వారి అమ్మాయి పల్లవిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు పల్లవి తల్లిదండ్రులు. పల్లవిది ఆత్మహత్య కాదని.. పల్లవిని ఎవరో హత్యచేసారని.. వారిని కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

వండర్లా రిసార్ట్ లో పల్లవి పనిచేస్తుందని.. అందులోనే మా అమ్మాయినీ వేధించారని ఆరోపిస్తున్నారు. వేధింపుల సంగతి ఇప్పటివరకు మాకు పల్లవి చెప్పలేదని అన్నారు. “ఆ రోజు పల్లవి ఇంటికి రాకపోవడంతో లేట్ అయిందని మేము ఫోన్ చేశాము. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. దీంతో వెంటనే ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. పోలీసులు పట్టించుకోని ఉంటే మా అమ్మాయి బ్రతికేది. ఆదిభట్ల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నమన్నరు. మాకు న్యాయం చేయాలని పోలీసులను వేసుకుంటున్నాం. మా అమ్మాయిని వేధించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు వారిని కఠినంగా శిక్షించాలి” అని పల్లవి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version