Flash : చిన్న జీయర్ స్వామికి పద్మభూషణ్…

-

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం 106 పద్మ అవార్డులను నిన్న రాత్రి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం పద్మ విభూషణ్‌-6, పద్మభూషణ్‌-9, పద్మశ్రీ-91. తెలంగాణకు రెండు పద్మ భూషణ్‌లు ఇస్తున్నట్లు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం.

ఇందులో తెలంగాణ నుంచి చినజీయర్‌ స్వామి కి పద్మ భూషణ్‌ అవార్డు వచ్చింది. అలాగే, కమలేష్‌ బీ పటేల్‌కు పద్మ భూషణ్‌ వచ్చింది. అటు ఏపీకి 7 పద్మ శ్రీ అవార్డులు వచ్చాయి. ఎంఎం కీరవాణికి (సంగీతం)పద్మశ్రీ పురస్కారం దక్కింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటడంలో కీలకంగా నిలిచిన ఆయన, ఏపీ నుంచి అవార్డుకు ఎంపికయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news