రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్- బీజేపీ పొత్తు ఉంటుంది – యశస్విని రెడ్డి

-

కాంగ్రెస్- బీజేపీ పార్టీలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్- బీజేపీ పొత్తు ఉంటుందంటూ టంగ్‌ స్లిప్‌ అయ్యారు యశస్విని రెడ్డి. ఇవాళ పాలకుర్తి నియోజక వర్గంలో… కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ- బీఆర్‌ఎస్‌ పార్టీల పొత్తును ఉద్దేశించి.. విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.

Palakurthy Mla Mamidala Yashaswini Reddy Shocking Comments on congress and bjp

ఈ తరుణంలోనే… బీజేపీ, బీఎస్పీ పార్టీలపై కాస్త గందర గోళం, కన్ఫూషన్‌ కు గురయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. దీంతో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్- బీజేపీ పొత్తు ఉంటుందంటూ అన్నారు. అయితే…పక్కన ఉన్న ఆమె అనుచరుడు.. చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోపే కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జై కేసీఆర్‌ అంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కాగా… ఎర్రబెల్లి దయాకర్‌ రావు లాంటి ఓటమి ఎరుగని నేతపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news