మా గెలుపు కోసం సాయం చేస్తే రాజయ్యను ఎమ్మెల్సీ చేస్తాం : పల్లా, కడియం

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అభ్యర్థులంతా తొమ్మిదన్నరేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా హనుమకొండ  జిల్లా వేలేరు మండలం షోడాశపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థులు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు స్టేషన్ ఘన్​పూర్, జనగామ నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే వారి గెలుపునకు రాజయ్య కృషి చేస్తే… రాజయ్యను ఎమ్మెల్సీ అయ్యేలా సహకరిస్తామని పల్లా రాజేశ్వర రెడ్డి ఈ సమావేశంలో అన్నారు. ఇప్పుడు పల్లా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పల్లా వ్యాఖ్యలను తప్పబడుతుండగా.. మరికొందరు మద్దతిస్తున్నారు. మొత్తానికి అభ్యర్థుల ఖరారుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంగా నిలిచిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news