పార్టీ మారడంపై పట్నం మహేందర్ రెడ్డి క్లారిటీ !

-

బీఆర్‌ఎస్‌ పార్టీ మారడంపై మాజీ మంత్రి మహేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నేను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోనవసరం లేదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి. తాజాగా తాండూరు బీఆర్ఎస్ నాయకుల ఘోడవ తార స్థాయికి చేరింది. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పై మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు.

తనను ఔట్ డేటెడ్ అన్న రోహిత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు మహేందర్ రెడ్డి. పార్టీ మారినప్పుడే రోహిత్ రెడ్డి ఔట్ డేటెడ్ అయ్యాడని చురకలు అంటించారు. అనుకోకుండా గెలిచి మొనగాడు అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి. ఆయన గతంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పుణ్యాన ఎమ్మెల్యే అయ్యాడని ఫైర్‌ అయ్యారు. టికెట్ ఎవరికి వచ్చేది మూడు నెలల్లో తెలుస్తుంది. ఆయన మాటలు అధిష్టానం దృష్టికి తీసుకెల్లాను. అధిష్టానం నాకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news