కాంగ్రెస్ పార్టీలో జూపల్లి చేరిక వాయిదా..!

-

కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు చేరిక వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. ఈ నెల జూలై 20న పాలమూరు సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో చేరాలని భావించారు జూపల్లి కృష్ణారావు. ఈ నెల జూలై 20న పాలమూరు ప్రియాంక గాంధీ సభ జరుగాల్సి ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ సభ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

అయితే..ప్రియాంక సభ వాయిదా పడి ఆగస్టులో జరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో అప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరుతా అంటున్నారు జూపల్లి కృష్ణారావు. అయితే… కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు చేరిక ఆలస్యం కావడంతో.. కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. జూపల్లి కృష్ణారావు చేరిక తొందరగా జరిగితే.. పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోవాలని నేతలు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news