హైదరాబాద్ డెంటిస్ట్​ కిడ్నాప్​ కేసులో నవీన్​రెడ్డిపై పీడీ యాక్ట్​

-

తెలంగాణలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ డెంటిస్టు వైశాలి కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన నవీన్‌రెడ్డిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. గతేడాది డిసెంబర్‌ 9న తుర్కయంజల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో డెంటిస్ట్‌ వైశాలిని నవీన్‌ రెడ్డి కొంతమందితో కలిసి కిడ్నాప్‌ చేశాడు. నవీన్‌ రెడ్డితో పాటు మరో నలభై మందిపై కేసు నమోదు కాగా అరెస్టయ్యారు. ఇప్పటికే ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌లో నవీన్‌రెడ్డిపై 5 కేసులు నమోదయ్యాయి.

అసలేం జరిగిందంటే.. అమెరికా పెళ్లి సంబంధంరావడంతో హైదరాబాద్‌ మన్నెగూడకు చెందిన డెంటిస్ట్ వైశాకికి గత సంవత్సరం డిసెంబర్​ 9న తల్లిదండ్రులు నిశ్చితార్ధం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్‌ రెడ్డి యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్రపన్నాడు.

ఇందుకోసం అనుచరులతోపాటు తన మిస్టర్ టీ ప్రాంఛైజీ స్టాళ్లలో పనిచేసే 36మందిని ముందురోజు రాత్రి మన్నెగూడకు రప్పించాడు. ఆ యువతి ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించి..కుటుంబ సభ్యులపై దాడి చేసి ఆమెను అపహరించాడు. ఆమెకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారంటూ నమ్మించి అపహరణ ప్రణాళికను రచించాడని పోలీసులు తేల్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version