శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు లో కలకలం.. విమానం హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్..

-

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు లో కలకలం. విమానం హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. దుబాయ్ ఫ్లైట్ ను హైజాక్ చేస్తామంటూ శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు ఈ-మెయిల్ వచ్చింది. ఈ-మెయిల్ తో అప్రమత్తమైన అధికారులు… మరికొద్దిసేపట్లో రన్ వే నుంచి బయల్దేరుతున్న సమయంలో అలెర్ట్ అయ్యారు. రన్వే పక్కనే ఫ్లైట్ ని నిలిపివేసి ప్రయాణికులను వాళ్ల ప్యాకేజీని క్షుణ్ణంగా చెక్ చేసింది సెక్యూరిటీ సిబ్బంది.

Plane Hijack Threat
Plane Hijack Threat

ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఫ్లైట్ ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన అధికారులు… తిరుపతి, వినోద్, రాకేష్ లను అదుపులోకి తీసుకొని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. దుబాయ్ మీదుగా ఇరాక్ కు వెళ్తున్న ఈ ముగ్గురితో పాటు తిరుపతిని సెండ్ హాఫ్ ఇవ్వడానికి వచ్చిన మహిళను సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇరాక్ లోని అమెరికాకు సోల్జర్స్ కు చెందిన బేస్ క్యాంపులో పని చేస్తున్నాడు తిరుపతి. తిరుపతికి ఐసీస్ తో లింకులు ఉన్నాయంటూ మెయిల్ లో పేర్కొన్నారు గుర్తు తెలియని వ్యక్తులు. తిరుపతిని పట్టుకోకపోతే దేశానికి మరో బిగ్ డే అవుతుందంటూ మెయిల్ చేశారు గుర్తు తెలియని వక్తులు. ఈ తరుణంలోనే.. తిరుపతిని సెండ్ హాఫ్ ఇవ్వడానికి వచ్చిన మహిళను సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news