ఈనెల 7, 11న తెలంగాణలో ప్రధాని మోదీ ప్రచారం

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారానికి మహబూబ్‌నగర్ వేదికగా శంఖారావం పూరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 7, 11వ తేదీల్లో రాష్ట్రానికి రానున్నారు. బీజేపీ నిర్వహించే బీసీ సభల్లో పాల్గొననున్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన తర్వాత ప్రధాన మంత్రి మోదీ రాష్ట్రానికి రానుండటంతో బీసీలతో బహిరంగ సభలు నిర్వహిస్తోంది.

మరోవైపు హైదరాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నల్గొండ జిల్లాల్లో సభలు నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత ఈ నెల 15వ తేదీ నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ఉద్ధృతం చేయనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు ప్రచార పర్వంలో పాల్గొననున్నారు. ఈ నెల 19వ తేదీ తరువాత మరోసారి ప్రధాని తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news