ఈనెల 8,10 తేదీల్లో తెలంగాణకు ప్రధాని మోదీ

-

సార్వత్రిక ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. జాతీయ నాయకులంతా రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ.. ఎన్నికల ప్రచారంలో జోరు సాగిస్తోంది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పలుమార్లు పర్యటించి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. కొందరు నేతలు బహిరంగ సభల్లో పాల్గొంటే.. మరికొందరు కార్నర్ మీటిగులు, రోడ్షోలతో ప్రచారం నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మోదీ.. ఈనెల 8, 10 తేదీల్లో తెలంగాణకు రానున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 8వ తేదీన వేములవాడ, వరంగల్ సభలకు మోదీ హాజరుకానున్నట్లు తెలిపాయి. 10వ తేదీన మహబూబ్నగర్తో పాటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు వివరించాయి.

Read more RELATED
Recommended to you

Latest news