రేపు తెలంగాణకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. కర్ణాటకలోని గుల్భర్గా నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రేపు మధ్యాహ్నం నారాయణపేటకు రానున్నారు.నారాయణపేట జూనియర్‌ కళాశాల మైదానంలో మహాబూబ్‌నగర్‌ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి డీకే అరుణకు మద్ధతుగా నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు. 3:15 నుంచి 4:05 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రధాని ప్రసంగించనున్నారు.

నారాయణపేట సభ ముగించుకుని హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 5:10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలు కలిపి ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సభలో ప్రధాని 5:30 నుంచి 6:20 గంటల వరకు పాల్గొననున్నారు. బహిరంగ సభ అనంతరం 6:40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి భువనేశ్వర్‌కు బయల్ధేరి వెళ్లనున్నారు. ప్రధాని సభ కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. మోదీ సభకు భారీగా జనసమీకరణ చేసే పనిలో పడింది.

Read more RELATED
Recommended to you

Latest news