ప్రధాని మోదీ మాటలకు కాలం చెల్లింది – రేవంత్ రెడ్డి

-

ప్రధాని నరేంద్ర మోడీ మాటలకు కాలం చెల్లిందని అన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటులో మణిపూర్ ఘటనను ప్రశ్నిస్తామని ప్రధాని సభకే రాలేదని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన జెమిలీ ఎన్నికలకు బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. జమిలీ ఎన్నికలను ఇండియా కూటమి వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.

జమిలి ఎన్నికలకు మద్దతు ఇస్తూ సీఎం కేసీఆర్ జూలై 6, 2018న లేఖ రాశారని వెల్లడించారు. వన్ నేషన్ వన్ టాక్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విషయంలో తాను ఏనాడో వ్యతిరేకించానని తెలిపారు. బిజెపితో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్న కేసీఆర్ జెమిలి ఎన్నికలకు మద్దతు ఇస్తున్నట్లు రాసిన లేఖపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news