కాంగ్రెస్‌ నేతలపై పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరలు దాడి !

-

కాంగ్రెస్‌ నేతలపై పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరలు దాడికి దిగారు. నిజామాబాద్ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి తెరపైకి వస్తోంది. వర్ని పోలీస్ స్టేషన్ అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం నాయకుల పై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గం నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు.

Pocharam Srinivasa Reddy’s followers attack on Enugu Ravinder Reddy’s group

శ్రీ నగర్, నెహ్రూనగర్ గ్రామాలకు చెందిన కొందరు కార్యకర్తలు ఈ దాడి చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం ఆరోపణలు చేస్తోంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా అక్కడ దాడికి దిగారు పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గం. పరస్పరం ఒకరి పై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చే శారు అధికార పార్టీ కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version