BREAKING : ఈ నెల 22న కాంగ్రెస్ లోకి జూపల్లి, పొంగులేటి..?

-

బీఆర్ఎస్ నుంచి వీడిపోయిన నేతలు పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరతారనే విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఓవైపు కాంగ్రెస్​లో చేరడం ఖాయమని వినిపిస్తుంటే.. మరోవైపు బీజేపీ.. కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తోంది. అయితే… తాజాగా జూపల్లి, పొంగులేటి ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరడం పై తాజాగా ఓ కీలక ప్రకటన వచ్చింది.

ఈ నెల 22 న కాంగ్రెస్ లోకి జూపల్లి, పొంగులేటి రానున్నట్లు సమాచారం అందుతోంది. రాహుల్ గాంధీ తో జూమ్ లో మాట్లాడారు పొంగులేటి, రేవంత్. రాహుల్ గాంధీతో జూమ్ సమావేశం ఏర్పాటు చేశారు డీకే శివ కుమార్. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరికపై వీరూ చర్చించారు. ఇక ఈ నె 21 న ఢిల్లీకి అమెరికా నుంచి రాహుల్ రానున్నారు. అదే రోజు ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళతారు. అదే సమయంలో… కాంగ్రెస్ లో జూపల్లి, పొంగులేటి చేరనున్నారు. ఇక చేరిక తరవాత ఖమ్మం, మహబూబ్ నగర్ లో సభలు నిర్వహించనుంది కాంగ్రెస్‌ పార్టీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version