గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ రానున్నారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు పై, బూర్గుల రామకృష్ణారావు భవన్లో జరుగనున్న పీ సీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కానున్నారు గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.

ఉదయం 11 గంటలకు కమిషన్ కార్యాలయం బీఆర్కే భవన్కు కేసీఆర్ చేరుకోనున్న తరుణంలో కాళేశ్వరంపై కేసీఆర్ విచారణ ఉత్కంఠ రేపుతోంది. విచారణలో భాగంగా కేసీఆర్కు సంఘీభావంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. విచారణ ఎదుర్కొన్న హరీశ్ రావును ఇదివరకే కమిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. ఇక ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. ఇప్పటికే ఈ కేసులో ఈటల , హరీష్ రావు ను విచారించారు.