Congress : చావు తర్వాత స్నానం చేద్దాం అంటే కరెంట్ లేదు!

-

Congress : చావు తర్వాత స్నానం చేద్దాం అంటే కరెంట్ లేని సంఘటన పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండలం నాగారం గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి మరణించాడు. దీంతో బావి వద్ద ఆ వ్యక్తి అంత్యక్రియలు చేశారు. అనంతరం స్నానం చేయడానికి కరెంటు లేకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు.

ఇక చేసేది ఏమీ లేక ఖర్మకాండలు చేసిన వ్యక్తే స్వయంగా అధికారులకు ఫోన్ చేసి కరెంట్ వేయమని అడుక్కోవలసి వచ్చింది. ఇది ఇలా ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ…. ఎన్నికల ప్రచార సమయంలో వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను నెరవేర్చే దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. కానీ రైతు బంధు మాత్రం ఇంకా వేయలేదు. అటు కరెంట్‌ కష్టాలు కూడా మొదలయ్యాయి.

https://x.com/TeluguScribe/status/1746053402730307745?s=20

Read more RELATED
Recommended to you

Latest news