KTRను సీఎం చేయాలంటే.. నీ బోడి సహాయం ఎవరికి కావాలి..? – ప్రశాంత్ రెడ్డి

-

KTRను సీఎం చేయాలంటే.. నీ బోడి సహాయం ఎవరికి కావాలి..? అంటూ తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి విరుచుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ… సీఎం కేసీఆర్‌ పై చేసిన వ్యాఖ్యలపై.. మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పచ్చి అబద్దాల కోరు అని నిజామాబాద్ సభ ద్వార మరోసారి నిరూపించారని ఆగ్రహించారు.కెటిఆర్ ను ముఖ్యమంత్రి చేయాలంటే నీ బోడి సహాయం ఎవరికి కావాలి..? అంటూ నిలదీశారు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి.

సీఎం కేసిఆర్ ఎన్డీయేలో కలుస్తానని చెప్పారనడం పచ్చి అబద్దం అన్నారు. ఎన్డీయే లో కలవమని మీరు బ్రతిమిలాడితే దేశాన్ని అమ్మే వారితో కలవమని కేసిఆర్ ఖరాఖండిగా చెప్పారని… నిజామాబాద్ సభలో కేసిఆర్ పై ప్రధాని మోడీ నిరాధార ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గం అంటూ ఫైర్‌ అయ్యారు. సీఎం కేసిఆర్ పై ఎన్నికల వేళ అవినీతి ఆరోపణలు చేస్తున్న నీవు ఇన్ని రోజులు ఏం చేశావు… దర్యాప్తు సంస్థలన్నీ నీ జేబులోనే ఉన్నాయి కదా..? అంటూ మండిపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడైన ప్రధాని నరేంద్ర మోడీ కేసిఆర్ గారిపై ఆరోపణలు చేయడం విడ్డూరం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news