మా ఫోటో వేయలేదంటూ గొడవకు దిగిన మంత్రి హరీష్ రావు

-

మా ఫోటో వేయలేదంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు గొడవకు దిగారు. రూ.640 కోట్ల నిధులు ఇస్తే.. మా ఫోటో వేయలేదంటూ మంత్రి హరీష్ రావు గొడవకు దిగారు. దీంతో సిద్దిపేట నూతన రైల్వే స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సిద్దిపేట నూతన రైల్వే స్టేషన్‌లో రైలు ప్రారంభం నిన్న జరిగిన సంగతి తెలిసిందే.

Harish rao
Harish rao

అయితే.. ఈ సిద్దిపేట నూతన రైల్వే స్టేషన్‌లో రైలు ప్రారంభం సందర్భంగా రైల్వే అధికారుల వైఖరి పట్ల మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.సిద్దిపేట రైల్వే లైన్‌ ఏర్పాటు, 2508 ఎకరాల భూసేకరణ, స్టేషన్ల నిర్మాణం కోసం 33% శాతం మొత్తం నిధులు రూ. 640 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోటోను, రైల్వే లైన్‌ నిర్మాణానికి కృషి చేసిన మంత్రి హరీష్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఫోటోలు వేయకపోవడం పట్ల బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news