నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. సూది మందు వికటించిన గర్భిణీ మృతి

-

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పురిటినొప్పులతో వచ్చిన ఏడు నెలల ఓ గర్భిణీ మహిళకు సూది మందు ఇచ్చారు. ఆ మందు వికటించి గర్భిణీ మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాకేంద్రం లోని ప్రియాంక ఆసుపత్రి లో చోటు చేసుకుంది. భాదిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తాడూర్ మండల కేంద్రానికి చెందిన మహేందర్, పద్మ (36) ఇద్దరికి ఇరవై ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఒక కూతురు ఉంది.

అయితే రెండో సారి గర్భం దాల్చి 7 నెలలు కావడంతో నొప్పులు వస్తున్నాయి అని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్ లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు వెళ్లారు. ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడంతో అందులో పని చేసే నర్సులు స్కానింగ్ చేసి సూదులు ఇచ్చారు. కొద్దిసేపటికి పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటూ బాధితులకు నర్సులు చెప్పారు. అంతలోనే గర్భిణీ మహిళా మృతి చెందింది. దీంతో ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి చెందిందని బంధువులు ఆస్పత్రి ముందు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. మృతికి కారణమైన ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news