ఈ నెల 18న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష

-

రాష్ట్రపతి ప్రతి ఏడాది శీతాకాల విడిది కోసం భాగ్యనగరానికి వస్తారన్న విషయం తెలిసిందే. అలాగే ఆ ఆనవాయితీ కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  హైదరాబాద్‌ పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతి కుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శీతాకాల విడిది కోసం ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ నగరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. తిరిగి ఈ నెల 23వ తేదీన దిల్లీకి వెళ్లనున్నారు. ఈ విడిది సమయంలో రాష్ట్రపతికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ శాంతి కుమారి సూచించారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news