గద్దర్ భార్యకు ప్రధాని నరేంద్ర మోడీ సంతాప లేఖ

-

ప్రజాకవి గద్దర్ భార్య గుమ్మడి విమలకు ప్రధాని నరేంద్ర మోడీ సంతాప లేఖ రాశారు. గద్దర్ మృతి చెందారని తెలిసి చాలా బాధపడ్డానని లేఖలో పేర్కొన్నారు ప్రధాని. గద్దర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గద్దర్ పాటలు బడుగుల జీవితం, సమస్యలను ప్రతిబింబిస్తాయని తెలిపారు. గద్దర్ రచనలు ప్రజలకు ఎంతో స్ఫూర్తిని అందించాయని పేర్కొన్నారు ప్రధాని మోదీ.

తెలంగాణ సాంప్రదాయక కళా రూపాన్ని పునరుజీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కొనియాడారు. గద్దర్ కుటుంబ సభ్యుల దుఃఖాన్ని మాటల్లో చెప్పలేనని, ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు దీనిని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news