స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి : ప్రొ.కోదండరామ్

-

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ పేర్కొన్నారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బీసీ జనసమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించేందుకు కృషి చేద్దామని తీర్మాణం చేశారు. ఈ సందర్భంగా ప్రొ.కోదండరామ్ మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ పూర్తిగా అమలు చేయడానికి తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక బీసీల కృషి ఎంతగానో ఉందని వెల్లడించారు. బీసీల జనాభా దామాషా ప్రకారం.. రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సమానత్వం పెంపొందించాలన్న ఆలోచన ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం హామీ ఇవ్వడంతోనే బీసీలంతా కాంగ్రెస్ వెంట నడిచారని పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version