నేడు రాష్ట్రంలో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటన

-

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే పాదయాత్రలు, సభలు, బస్సు యాత్ర చేపట్టి తమ ఆరు గ్యారెంటీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక బస్సు యాత్రను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఈ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఆకర్షించనున్నారు.

ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్న ప్రియాంక.. మొదట అక్కడి మహిళలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజాభేరి సభకు వెళ్లి అక్కడ ప్రసంగిస్తారు. పీసీసీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ప్రియాంక ప్రచారం చేయనున్నారు.

మరోవైపు ఇప్పటికే బస్సు యాత్రలో భాగంగా మూడ్రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన రాహుల్ గాంధీ ఇప్పుడు మరోసారి రాష్ట్రానికి రానున్నారు. బుధవారం రోజున రాష్ట్రానికి రానున్న రాహుల్.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. బస్సుయాత్రలో భాగంగా కల్వకుర్తిలో కూడలి సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం జడ్చర్ల, షాద్‌నగర్‌లో కూడలి సమావేశంలో రాహుల్‌ పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news