తమ భూమిని కబ్జా చేసారంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ వద్ద ఆందోళన..!

-

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం పోచారం పోలీస్ స్టేషన్ పరిధి వెంకటాపూర్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టు వారు తమ భూమిని కబ్జా చేశారనీ , తమకు న్యాయం చెయ్యాలంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేశారు.

అయితే వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే 796 లోని పదకొండు ఎకారాల ఇరవై గుంటలలో ఏడు ఎకరాల ఇరవై గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనీ.. మిగతా నాలుగు ఎకరాల తమ భూమిని రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరిపై మరొకరు తోపులాటకు పాల్పడ్డారు. అయితే పోచారం ఐటి కారిడార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

Read more RELATED
Recommended to you

Latest news