ఆ చెరువు చుట్టూ సీసీ కెమెరాలు పెట్టండి అంటూ… 2 లక్షలు ఇచ్చిన రేవంత్ రెడ్డి…!

-

మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంతంలో మల్కాజిగిరి ఎంపి రేవంత్ రేడ్డి పర్యటించారు. సున్నం చెరువు బఫర్ జోన్ లో యధేచ్ఛగా అక్రమ కట్టడాలు జరుగుతున్నా సరే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. కబ్జదారులకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. సున్నం చెరువు బఫర్ జోన్ లో జరుగుతున్న నిర్మాణాలు అన్ని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లో జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.

revanth-reddy
revanth-reddy

సున్నం చేరువు పై జరుగుతున్న అక్రమాలపై హైకోర్టు లో పిటిషన్ వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. చెరువుల చుట్టూ సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. తన ఎంపీ నిధుల నుండి సున్నం చెరువు చుట్టూ సీసీ కెమెరాల ఏర్పాటు కోసం 2 లక్షల రూపాయలు ఇప్పుడే మంజూరు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news