ఖమ్మం జిల్లాలో 10 సీట్లు గెలిచి..సీఎం కేసీఆర్‌ కు గిఫ్ట్‌ ఇవ్వాలి – పువ్వాడ

-

ఖమ్మం జిల్లాలో 10 సీట్లు గెలిచి..సీఎం కేసీఆర్‌ కు గిఫ్ట్‌ ఇవ్వాలన్నారు మంత్రి పువ్వాడ అజయ్‌. BRS పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ…. మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5సీట్లు,ఖమ్మం జిల్లాలోని 5 సీట్లు గెలిపించుకుని కేసీఅర్ గారికి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్తాం… మేం పనిచేశామని…BRS ప్రభుత్వం పని చేసిందని.. BRS కార్యకర్తలు తమకు తోచిన రీతిలో పని చేశారని పేర్కొన్నారు.

గోదావరి వరదలు వచ్చాయి.. ప్రజల ప్రాణాలు పోకుండా కంటికిరెప్పలా కాపాడుకున్నామని.. గోదావరి అటువైపు నేను .. ఇటు వైపు రేగ కాంతారావు వరదల్లో పని చేశాం. మీరేం చేశారు..? ఇక్కడ నిద్రపోయారో చెప్పాలని వెల్లడించారు. అలాంటి వాళ్ళను మనం గెలిపించుకోవాలా…మనకు పని చేసే వారినే మనం గెలిపించుకోవాలని కోరారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 16వేల మందికి పోడు భూముల పట్టాలు కేసీఅర్ గారు ఇచ్చారు..ముఖ్యమంత్రి కేసీఅర్ గారు మన జిల్లా రైతాంగం కోసం, ప్రజల కోసం రూ.13వేల కోట్ల రూపాయలతో సీతారామ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చి..లక్షల ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందించేందుకు పని చేస్తున్నారని గుర్తు చేశారు పువ్వాడ.

Read more RELATED
Recommended to you

Latest news