BREAKING: రాయ్ బరేలి బయలుదేరిన రేవంత్ రెడ్డి..సిరిసిల్లా సభ రద్దు !

-

BREAKING: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి..సిరిసిల్లా సభ రద్దు అయిందని సమాచారం అందుతోంది. తెలంగాణ లో ఉన్న కార్యక్రమాలు రద్దు చేసుకొని కాసేపట్లో రాయ్ బరేలి బయలుదేరనున్నారు రేవంత్ రెడ్డి. ఈ రోజు రాహుల్ గాంధీ నామినేషన్లో పాల్గొననున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Rae Bareli left Revanth Reddy

ఇందులో భాగంగానే… ప్రత్యేక విమానంలో రాయ్ బరేలి వెళ్తూ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఆగారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు స్వాగతం పలికారు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎంపీ అనిల్ యాదవ్. అనంతరం ఇదే విమానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖర్గే గారితో కలిసి రాయ్ బరేలి వెళ్తారని సమాచారం. దీంతో తెలంగాణ లో ఉన్న కార్యక్రమాలు రద్దు చేసుకోనున్నారు సీఎం రేవంత్‌.

Read more RELATED
Recommended to you

Latest news