3.5 లక్షల మెజార్టీతో ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనవిజయం

-

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా సాగుతోంది. మొత్తం 17 స్థానాలకుగా ఓట్ల లెక్కింపు జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీ తొలి విజయంతో బోణీ కొట్టింది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో హస్తం పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి 3.5 లక్షల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయనకు పలువురు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు రఘురాంరెడ్డి గెలుపుతో ఖమ్మంలో సంబురాలు అంబరాన్నంటాయి. పార్టీ కార్యాలయానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబురాలు జరుపుకుంటున్నారు.

మరోవైపు రాష్ట్రంలో ఖమ్మం సీటును కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జహీరాబాద్, నల్గొండ, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, మెదక్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఇందులో నల్గొండ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీతో ఆధిక్యం లో నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news