ప్రజల తెలంగాణ కోరుకుంటే.. దొరల తెలంగాణ వచ్చింది: రాహుల్ గాంధీ

-

ప్రజల తెలంగాణ కోరుకుంటే.. దొరల తెలంగాణ వచ్చిందని ఆగ్రహించారు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. దోపిడి సొమ్మంతా బిఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. జగిత్యాలలో మాట్లాడుతూ ”ప్రజల తెలంగాణ కోరుకుంటే…. దోరల తెలంగాణ వచ్చింది. ఈ ఎలక్షన్ దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతోంది.

ఓబీసీకి రిజర్వేషన్లు వద్దని మోదీ, కేసీఆర్ అంటున్నారు. ఓబిసి కుల గణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. ఓబీసీ లో కేవలం ఐదు శాతమే ఉన్నారా? ” అని ప్రశ్నించారు. అడవిలో సింహాలు ఒంటరిగా కనిపిస్తాయి….కానీ తెలంగాణ కాంగ్రెస్ లో చాలా పులులు కలిసికట్టుగా బీఆరెస్ తో పోరాడుతున్నాయన్నారు. తెలంగాణ కాంగ్రెస్ గబ్బర్ షేర్..ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. వచ్చేది కాంగ్రెస్‌ పార్టీ రాజ్యమే అని స్పష్టం చేశారు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news