Telangana Rains : జలదిగ్భందంలో చిక్కుకున్న 1500 మంది?

-

భూపాలపల్లి జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచపల్లె వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా మొరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇప్పటికే ముగ్గురు గ్రామస్తులు వరదలో కొట్టుకుపోగా… ఇళ్లలోని సామాన్లు వరద పాలవుతున్నాయి. ఊరంతా నీరు చేరడంతో ప్రజలు మిద్దెలపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

మరోవైపు గ్రామంలోని 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు హెలికాప్టర్ సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు…హనుమకొండ జిల్లా కాజీపేట సోముడిలో గత రాత్రి పిడుగు పడి కొన్ని ఇండ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమయ్యాయి అయ్యాయి. వర్షంతో నగరంలోని ముంపు ప్రాంతాలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. వరంగల్లోని ఎస్ఆర్ నగర్, డీకే నగర్, సంతోషిమాత కాలనీ, మధురానగర్, శాకరాశికుంట, శివనగర్, చింతల్, ఉర్సు, ఎన్టీఆర్ నగర్, మధురనగర్, పద్మానగర్, పోతన కాలనీ, బృందావన్ నగర్ తదితర ప్రాంతాలు నీటిమయం అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news