తెలంగాణ ఎన్నికల కమిషనర్ గా రాణి కుముదిని

-

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని రాణి కుముదిని నియమితులయ్యారు. ప్రస్తతం ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీ కాలం సెప్టెంబర్ 08వ తేదీనే ముగియడంతో ఆయన స్థానంలో రాణి కుముదిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గవర్నర్ బిష్ణు దేవ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు.

మూడేళ్ల పాటు ఆమె ఎస్ఈసీగా కొనసాగనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1988 బ్యాచ్ కు చెందిన కుమిదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు చేపట్టారు. 2023 ఎన్నికలకు ముందు పదవీ విరమణ చేశారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆమెను తిరిగి అదే హోదాలో కొనసాగించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నూతన ఎస్ఈసీ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news