ప్రభుత్వాస్పత్రుల్లో రికార్డు స్థాయిలో ప్రసవాలు : హరీష్‌రావు

-

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో ప్రసవాలు జరిగాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. జూలైలో అత్యధికంగా 72% డెలివరీలు జరిగినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 30% డెలివరీలు మాత్రమే జరిగాయని… ప్రస్తుతం సౌకర్యాలు కల్పించడంతో గర్భిణీలు ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నట్లు వివరించారు.

ఈ మేరకు వైద్యారోగ్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. అటు బిజెపి పై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 86 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదికగా బిజెపి ఎంపి తప్పుడు ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానిది లేదని, తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకున్న సొంత నిధులతో ప్రాజెక్టును పూర్తి చేసిందని మంత్రి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news