దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు

-

దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చాలా బిజీ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయంలో పలువురు ప్రవాసీ తెలంగాణ ప్రముఖులతో నా సహచర మంత్రి శ్రీధర్ బాబు, రేవంత్‌ రెడ్డి కలిసి కాసేపు సంభాషించారు.

Switzerland

సమ్మిళిత, సంతులిత అభివృద్ధి ద్వారా ప్రజలందరి పురోగతికోసం ఒక నవ తెలంగాణ నిర్మాణానికై మొదలైన మా ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వాములవడం పట్ల వారు ఎంతో ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. మన తెలంగాణ రాష్ట్ర పెవిలియన్‌ వేదికగా నేటినుండి తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే మా కార్యక్రమాలు (#InvestInTelangana) ప్రారంభించనున్నాం. ఈ దిశగా ఈ రోజంతా దావోస్‌లో అనేక కీలక సమావేశాల్లో పాల్గొంటున్నామని ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news