కేసీఆర్ బై.. బై చెప్పి, కాంగ్రెస్ కు స్వాగతం చెప్పండి – రేవంత్‌ రెడ్డి

-

కేసీఆర్ బై.. బై చెప్పి, కాంగ్రెస్ కు స్వాగతం చెప్పండన్నారు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లి ప్రాజెక్టు వద్ద టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. స్వరాష్ట్రంలోనూ గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని.. మల్లన్న సాగర్ కి ఒక న్యాయం గండిపల్లికి ఒక న్యాయమా? ఆయన సొంత ప్రాంతం ప్రాజెక్టులు కట్టి ఈ ప్రాంతం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

ఈ ప్రాజెక్టులను స్వయంగా సందర్శించిన సీఎం కేసీఆర్ సామర్థ్యం పెంచుతానని చెప్పాడని.. కుర్చీ వేసుకొని, గండిపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయిస్తానని చెప్పి గాలికి వదిలేసాడని ఫైర్‌ అయ్యారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ.. పూర్తి చేసేది కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. పదవి విరమణ రాజకీయ విరమణ చెప్పిన కేసీఆర్ వల్ల పూర్తికాని గండిపల్లి ప్రాజెక్ట్ బీఆర్ఎస్ పూర్తి చేస్తుందనే నమ్మకము లేదన్నారు. రాజకీయ విరమణ అని ప్రకటించిన కేసీఆర్ కు ఆయురారోగ్యాలు కలగాలి, వారి శేషజీవితం ప్రశాంతంగా గడవాలని కోరుకుంటున్నానని.. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version