మునుగోడు సభకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వస్తున్నారు – రేవంత్‌

-

మునుగోడు సభకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వస్తున్నారని..ఆయన కచ్చితంగా రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కోరారు. మునుగోడు సభకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వస్తేనే.. కాంగ్రెస్‌ మరింత దూకుడుగా ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు రేవంత్‌ రెడ్డి. రాజ్ గోపాల్ రెడ్డి సవాళ్ళపై మునుగోడు లో స్పందిస్తానని.. రాజ్ గోపాల్ రెడ్డి తో ఏ చర్చకు అయినా సిద్ధమని సవాల్‌ చేశారు రేవంత్.

రాజ్ గోపాల్ రెడ్డికి కులగురువు కేసీఆర్ అని.. వెంకన్న మా వాడే.. ఆయనపై కామెంట్స్ చెయ్యలేదని తెలిపారు. రాజ్ గోపాల్ రెడ్డి వేరు.. వెంకట్ రెడ్డి వేరని చెప్పారు. వెంకట్ రెడ్డి మా కుటుంబ సభ్యుడని.. రాజ్ గోపాల్ రెడ్డి ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజ్ గోపాల్ రెడ్డి ప్రస్తావించే బ్రాoడ్ కాంగ్రెస్ ఇచ్చిందేనని.. రాజ్ గోపాల్ రెడ్డి పై చేసిన కామెంట్స్..వెంకట్ రెడ్డి కి వివరణ ఇస్తున్నానని రేవంత్‌ రెడ్డి తెలిపారు. వెంకట్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్నా..రాజ్ గోపాల్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు వెంకట్ రెడ్డికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు రేవంత్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news