బీజేపీ నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం: రాహుల్ గాంధీ

-

బీజేపీ నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తోందని పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యన్ని ప్రభుత్వం ఎలా ఖూనీ చేస్తుందో చూస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విపక్షాల గొంతుకను నొక్కేస్తున్నారని డిమాండ్ చేశారు. ప్రశ్నించిన వాళ్లను జైలులో వేస్తున్నారని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ

దేశంలో నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, నిరుద్యోగం, సమాజంలో హింస పెరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కొందరు నాయకుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వ్యాపారులకు అండగా.. కేంద్రం పని చేస్తోందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతలు ఈ రోజు ప్రధాని ఇంటిని చుట్టుముట్టనున్నారు. అలాగే లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు చలో రాష్ట్రపతి భవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news