నేడు 4 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

-

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం జరుగనుంది. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి.

ఇవాళ ఉదయం 11 గంటలకు నకిరేకల్ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటలకు తుంగతుర్తి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు ఆలేరు బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30కి కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, బీబీపేట కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి.

కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుస్తామని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాజాగా సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి… ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని… 80 సీట్ల వరకు గెలిచే ఛాన్స్ ఉందని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news