పొన్నాల లక్ష్మయ్యకు అసలు సిగ్గుందా – రేవంత్ రెడ్డి

-

పొన్నాల లక్ష్మయ్యకు అసలు సిగ్గుందా అంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పొన్నాల లక్ష్మయ్య అనూహ్యంగా నిన్న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. బీసీలకు టికెట్లు ఇవ్వడం లేదనే కారణంతో పాటు పార్టీలో రెండేళ్లుగా తనను అవమానిస్తున్నారంటూ పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మీడియా ముందే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

revanth slams ponnala
revanth slams ponnala

కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పొన్నాల రాజీనామా కీలకంగా మారింది. అయితే..కాంగ్రెస్‌ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడంపై పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొన్నాల లక్ష్మయ్యకు అసలు సిగ్గుందా అంటూ ఫైర్‌ అయ్యారు రేవంత్‌ రెడ్డి. చచ్చేముందు పార్టీ మారడానికి పొన్నాల లక్ష్మయ్యకు సిగ్గుండాలని.. పొన్నాల పార్టీ మారడంపై రేవంత్ రెడ్డి దురుసు వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news